స్వయం ఉపాధి:
– గత ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాల కింద 2,02,414 మంది ఎస్సీ, ఎస్టీలకు రూ.2,726 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
– ఈ ప్రభుత్వ హయాంలో మునుపెన్నడూ లేని విధంగా 23,17,558 మంది ఎస్సీలకు ఆసరా, చేయూత పథకాల ద్వారా రూ.7,075.29 కోట్లు, 4,72,018 మంది ఎస్టీలకు రూ.1,392 కోట్లు మేర లబ్ధి జరిగింది.
ఎస్సీలకు జీవనోపాధి కోసం వాహనాలు:
ఎస్సీ లబ్ధిదారుల స్థిరమైన జీవనోపాధి, ఆర్థిక అభ్యున్నతి కోసం పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా 2020–21లో రాష్ట్ర ప్రభుత్వం రూ.133.67 కోట్లతో 2,300 మందికి ఫోర్ వీలర్ మినీ ట్రక్ మొబైల్ డిస్పెన్సరి యూనిట్ వాహనాలను పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డోర్ డెలివరీ కోసం అందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎస్ఎఫ్డీసీ స్వయం ఉపాధి పథకం కింద 1,038 యూనిట్లతో రూ.63.20 కోట్లతో అమలు చేసింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్లు:
– గత ప్రభుత్వంలో ఎస్సీ పెన్షనర్లు 8,66,835 మంది మాత్రమే. వారికి నెలకు రూ.1000 చొప్పున ఖర్చు చేసిన మొత్తం రూ.4,415 కోట్లు.
– కానీ ఈ ప్రభుత్వం నెలకు రూ.2,750 పెన్షన్ ఇస్తోంది. మొత్తం లబ్ధిదారులు 12,15,030. వీరికోసం చేసిన వ్యయం రూ.14,418 కోట్లు. అంటే గతంలో కంటే మూడున్నర రెట్లు ఎక్కువ. మొత్తం పెన్షన్లకు చేస్తున్న వ్యయంలో ఇది 18.41 శాతం.
– ఇక ఎస్టీల విషయానికొస్తే గత ప్రభుత్వం 3,01,242 మందికి రూ.1373 కోట్లు మాత్రమే వెచ్చించింది.
– కానీ వైయస్ జగన్ గారి ప్రభుత్వం 3,94,753 మందికి రూ.4,694 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇది గతంలో కంటే మూడున్నర రెట్లు ఎక్కువ. మొత్తం పెన్షన్లకు చేస్తున్న వ్యయంలో ఇది 6 శాతం.
యాజమాన్య హక్కులు కల్పించిన సీఎం వైయస్ జగన్:
– భూమి కొనుగోలు పథకం ఎత్తివేశారంటూ ఈనాడు దినపత్రిక తన కథనంలో పేర్కొంది. అయితే గత ప్రభుత్వం ఈ పథకానికి ఎంతమేర భూమి సేకరించిందో కూడా రాస్తే బాగుండేది. అప్పుడు అసలు ఈ పథకాన్ని ఎవరు ఎత్తేశారో ప్రజలందరికీ సులభంగా అర్థం అవుతుంది.
– దశాబ్దాల కింద భూమి కొనుగోలుకోసం ఎస్సీ కార్పొరేషన్ల నుంచి రుణాలు తీసుకున్న ఎస్సీల భూమి ఇప్పటికీ తనఖాలో ఉండిపోయింది. వైయస్ జగన్ గారి ప్రభుత్వం ఎస్సీలు తీసుకున్న అలాంటి రుణాలన్నింటినీ రద్దుచేసి, వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించింది. ఎస్సీల జీవితాల్లో ఇది మైలురాయి.
– 14.223 మంది దళిత మహిళలకు 16,213 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభించాయి. మరో 3,57,085 మంది ఎస్సీలకు, 1,20,477 మంది ఎస్టీలకు అసైన్డ్ భూములపై ఈ ప్రభుత్వం పూర్తి హక్కులు కల్పించింది.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇళ్లు, ఇళ్ల స్థలాలు:
– ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంటి నిర్మాణాల రీత్యా గత ప్రభుత్వం ఒక్క సెంటు భూమి కూడా కొనుగోలు చేయలేదు.
– కానీ వైయస్ జగన్ గారి ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా దళితులకు, ఎస్టీలకు బాసటగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 31 లక్షలకుపైగా ఇళ్లపట్టాలు ఇస్తే అందులో 6,36,732 మంది లబ్ధిదారులు దళిత వర్గాల అక్క చెల్లెమ్మలే. ఆయా కుటుంబాలకు రూ.10,949 కోట్ల లబ్ధి చేకూర్చింది.
– వారికోసం చేస్తున్న 4,18,646 ఇళ్ల నిర్మాణ రూపంలో మరో రూ.10,949 కోట్ల లబ్ధి చేకూరుతోంది. 1,41,496 మంది ఎస్టీ అక్కచెల్లెమ్మలు ఉన్నారు.
– ఇంత భారీస్థాయిలో దళితులకు ఏ ప్రభుత్వమూ అండగా నిలబడలేదు.
విదేశీ విద్యకు చేయూతనిస్తున్న వైయస్ జగన్ ప్రభుత్వం:
– నాణ్యమైన విద్యకు తిలోదకాలు అంటూ ఈనాడు మరో కట్టుకథ రాసింది. విదేశీ విద్యా పథకం రద్దు అయిందని, బెస్ట్ అవైలబుల్ పథకం లేదని ప్రచురించింది.
– గత ప్రభుత్వ హయాంలో విదేశీ విద్యాపథకంలో లోపాలను, అవినీతిని, అక్రమాలను ఈ ప్రభుత్వం గుర్తించి ఆ స్థానంలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని తీసుకు వచ్చింది.
– ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా, ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీటు సాధించిన వారికి పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించేలా పథకాన్ని సమున్నతంగా తీర్చిదిద్ది అమలు చేస్తోంది.
– 21 కోర్సుల్లో క్యూఎస్ ర్యాంకింగ్ లేదా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంక్ల ప్రకారం 50 ఉత్తమ ర్యాంకులు గల విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు లేదా ట్యుషన్ ఫీజు 100% చెల్లించేలా పథకాన్ని గొప్పగా మార్చి అమలు చేస్తున్నారు.
– మిగిలిన వర్గాలకు రూ.కోటి గానీ లేదా అసలు ట్యూషన్ ఫీజు (ఏది తక్కువ అయితే అది) చెల్లిస్తున్నారు.
– ఈ స్థాయిలో విదేశీ విద్యకోసం గత ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోయింది.
అమ్మ ఒడి, నాడు – నేడు, విద్యాకానుక... ఒకటా రెండా:
– పిల్లలంతా బడిలో ఉండాలనే ఏకైక ధ్యేయంతో 8,84,131 మంది ఎస్సీ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి కింద రూ.15వేల చొప్పున రూ.5,335.7 కోట్లు ఇప్పటివరకూ అందించింది. 2,86,379 ఎస్టీ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి కింద రూ.1,714.75 కోట్లు అందించింది.