Postlar filtri


👆 శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి : శతావధాని శ్రీ ఆముదాల మురళి

– ఘనంగా శ్రీ అనంతకృష్ణశర్మ 46వ వర్ధంతి

తిరుపతి, 2025 మార్చి 11: సంగీత, సాహిత్య రంగాల్లో అపారమైన జ్ఞానం ఉన్న శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి అని శత అవధాని శ్రీ ఆముదాల మురళి కొనియాడారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం ఉదయం శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 46వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా శ్రీ ఆముదాల మురళి మాట్లాడుతూ, శ్రీ రాళ్లపల్లి వారికి సంగీతం, సాహిత్యం రెండు కళ్లు లాంటివని,
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు వందల కృతులను స్వరపరిచారని తెలిపారు. రాగి రేకుల్లో పేర్కొన్న రాగాలతోనే స్వరపరిచారని, ఈ రాగాలు ప్రస్తుతం లేకపోయినా అన్నమయ్య కాలం నాటి సమకాలీన సంగీతాన్ని దృష్టిలో ఉంచుకుని బాణీలు కూర్చారని చెప్పారు.
పాండురంగ మహత్యం, రంగనాథ రామాయణం మొదలగు గ్రంథాలలో ఇదివరకు ప్రచురణకర్తలు పొరపాటుగా ముద్రించిన పద్యాలను సరి చేశారని వివరించారు.

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తెలుగు అధ్యాపకులు డాక్టర్‌ లక్ష్మీనారాయణ “శ్రీరాళ్లపల్లి వారి విమర్శ సాహిత్యం ” అనే అంశంపై మాట్లాడుతూ, సారస్వత లోకం, నాటక లోకం అన్న గ్రంథాలలో రాళ్లపల్లి వారు అనేక వ్యాసాలను రచించినట్లు తెలిపారు అందులో నిగమ శర్మ – అక్క, రాయలనాటి రసికత, వేమన మొదలగు ఎన్నో వ్యాసాలు నీటికి విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉన్నట్లు చెప్పారు. కట్టమంచి రామలింగారెడ్డి స్నేహంతో వారు ప్రాచీన ఆధునిక, విమర్శ పదాలను మేలవించారని తెలిపారు.
శ్రీ రాళ్లపల్లి వారికి ఎక్కువ భాషలు తెలిసి ఉండడం, రాయలసీమ వ్యక్తి కావడం, వైష్ణవతత్వంపై అవగాహన ఉండడంతో అన్నమయ్య రాగిరేకుల్లోని కీర్తనలను ఎంతో ప్రామాణికంగా వెలుగులోకి తీసుకొచ్చారని తెలియజేశారు.

అనంతరం రాళ్లపల్లి వారి మనుమరాలు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ శ్రీమతి రాళ్లపల్లి దీప్త మాట్లాడుతూ, రాళ్లపల్లి వారికి సంస్కృతం, ప్రాకృతం, తెలుగు, కన్నడ భాషల్లో మంచి పాండిత్యం ఉందని, ఈ కారణంగానే అన్నమయ్య రాగిరేకుల్లోని సాహిత్యాన్ని చక్కగా అర్థం చేసుకుని పరిష్కరించారని చెప్పారు. అప్పటి ఈవో శ్రీ పివిఆర్కె ప్రసాద్ చేతులమీదుగా టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా నియామకమైన రోజే శ్రీ అనంతకృష్ణ శర్మ పరమపదించారని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

కాగా, ఉదయం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ మార్గంలోని శ్రీ రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో డిపిపి ఏఈఓ శ్రీ రాములు, శ్రీ రాళ్లపల్లి రఘునందన్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో పుర ప్రజలు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.




Join the sacred trek on March 14, 2025, in Tirumala and seek the divine blessings of Sri Venkateswara Swamy. Trek from 5 AM – 12 PM. Free food and medical aid available. Follow safety guide




Tirupati SSD & Srivari Mettu Tokens Present Status

SSD Tokens Status Updates 👇

👉WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

👉 Telegram group:- https://t.me/LaxmiTeluguTech

👉 Telegram Channel :- https://t.me/LaxmiTeluguTechChannel

👉Youtube Channel :-https://www.youtube.com/@LaxmiTeluguTech


Offline Accommodation availability information at the CRO, Tirumala, as of 08:00AM today.


🙏 Om Namo Venkatesaya 🙏

10-03-2025

Total pilgrims - 69,746

Tonsures: 23,649

Hundi kanukalu : 4.27 Cr

Waiting Compartments… 13

Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens).... 12H

(SSD)Time slot Sarvadarshan... 3 to 5H

Rs 300 Special Darshan Approx. Time... 2 to 3H

Tq.

------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతుంది అంటే అది SSDటోకెన్లు లేకుండా ఆల్రెడీ q లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 08 గంటలు అని.

ప్రస్తుతం కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 10 నుంచి 12 గంటల పైన సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.

----
తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్, తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-

https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

https://t.me/LaxmiTeluguTech

https://www.youtube.com/@TtdLatestUpdates

👉 New Channel ( ఇ News తెలుగు ) :-https://www.youtube.com/@enewstelugu?sub_confirmation=1


Tirupati SSD & Srivari Mettu Tokens Present Status

SSD Tokens Status Updates 👇

👉WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

👉 Telegram group:- https://t.me/LaxmiTeluguTech

👉 Telegram Channel :- https://t.me/LaxmiTeluguTechChannel

👉Youtube Channel :-https://www.youtube.com/@LaxmiTeluguTech


Srivari Mettu Tokens Present Status

SSD Tokens Status Updates 👇

👉WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

👉 Telegram group:- https://t.me/LaxmiTeluguTech

👉 Telegram Channel :- https://t.me/LaxmiTeluguTechChannel

👉Youtube Channel :-https://www.youtube.com/@LaxmiTeluguTech


SSD Tokens Present Status @ Tirupati

(Srinivasam + Vishnunivasam + Bhudevi Complex)

SSD Tokens Status Updates 👇

👉WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

👉 Telegram group:- https://t.me/LaxmiTeluguTech

👉 Telegram Channel :- https://t.me/LaxmiTeluguTechChannel

👉Youtube Channel :-https://www.youtube.com/@LaxmiTeluguTech


SSD Tokens Present Status @ Tirupati

(Srinivasam + Vishnunivasam + Bhudevi Complex)

SSD Tokens Status Updates 👇

👉WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

👉 Telegram group:- https://t.me/LaxmiTeluguTech

👉 Telegram Channel :- https://t.me/LaxmiTeluguTechChannel

👉Youtube Channel :-https://www.youtube.com/@LaxmiTeluguTech


తెప్పపై రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామివారి అభయం

తిరుమల, 2025 మార్చి 10: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు.

ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో మూడుసార్లు విహరిస్తూ భ‌క్తుల‌ను క‌టాక్షించారు. వేదం, గానం, నాదం మ‌ధ్య తెప్పోత్స‌వం వేడుక‌గా జ‌రిగింది.

కాగా, మూడవరోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారు తిరుచ్చిపై సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆశీనుడై మూడుసార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, వీజీవో శ్రీ రామ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.


👆 ధ్వ‌జారోహణంతో ఉపమాక శ్రీ వేంకటేశ్వరాలయంలో ఏకాదశి కల్యాణాలు ప్రారంభం

•⁠ ⁠వైభవంగా శ్రీవారి కల్యాణం

తిరుపతి, 2025 మార్చి 10: అన‌కాప‌ల్లి జిల్లా ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరాలయంలో సోమ‌వారం ఉద‌యం ధ్వ‌జారోహణంతో ఏకాదశి కల్యాణాలు వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. మార్చి 10 నుంచి 17వ తేదీ వరకు ఈ క‌ల్యాణాలు నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా సోమ‌వారం ఉద‌యం 8 నుండి 10 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారికి, శ్రీ సుద‌ర్శ‌న పెరుమాళ్‌కు పల్లకీ ఉత్సవం ఘనంగా జరిగింది. ఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు ధ్వ‌జారోహణంతో కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి.

రాత్రి 7.40 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు ఎదురు స‌న్నాహ మ‌హోత్స‌వం ( క‌న్యావ‌రుణ సంవాదం) నిర్వ‌హించారు. ఇందులో శ్రీ‌వారు గ‌రుడ వాహ‌నంపై శ్రీ‌దేవి, భూదేవి అమ్మ‌వార్లు శేష త‌ల్ప వాహ‌నంపై భ‌క్తుల‌ను క‌టాక్షించారు. త‌రువాత మార్చి 11వ తేదీ మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 12.30 (సోమ‌వారం అర్థ‌రాత్రి) నుండి ఉద‌యం 3.30 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు కల్యాణోత్సవం వైభ‌వంగా నిర్వహించనున్నారు.

క‌ల్యాణోత్స‌వంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. ఆల‌య అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్ని ప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళ సూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన ఉప‌మ‌క ప‌రిస‌ర ప్రాంతాల‌ భక్తులు భక్తి పరవశంతో పులకించారు.

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర హోం మంత్రి శ్రీ‌మ‌తి వంగ‌ల‌పూడి అనిత‌, అన‌కాప‌ల్లి జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ విజ‌య‌క్రిష్ణ‌న్‌, ఏఈవో శ్రీ జ‌గ‌న్మోహ‌న ఆచ్చారి, సూపరింటెండెంట్ శ్రీ వెంక‌ట ర‌మ‌ణ‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కుర్మేష్వారావు, ఇత‌ర అధికారులు, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

కాగా మంగ‌ళ‌వారం రాత్రి 7.40 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు స్వామివారు హంస‌వాహ‌నంపై ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

మార్చి 12వ తేదీ రాత్రి 9 నుండి 10 గంటల వరకు శ్రీ భూ సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారు పుణ్యకోటి వాహనంపై భక్తులను క‌టాక్షించ‌నున్నారు.

మార్చి 13వ తేదీ మ‌ధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 6 గంటల వరకు తోట ఉత్సవం, శ్రీ భూ సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారు రాజాధిరాజ‌వాహ‌నంపై దర్శనమిస్తారు. అనంత‌రం రాత్రి 7.30 నుండి 10 గంటల వరకు శ్రీవారు గజవాహనంపై భక్తులను క‌టాక్షిస్తారు.

మార్చి 14వ తేదీ మ‌ధ్యాహ్నం 2.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు చక్రస్నానం జరగనుంది. రాత్రి 10.30 నుండి అర్థ‌రాత్రి 12 గంటల వరకు రథోత్సవం వైభవంగా జరగనుంది.

మార్చి 15వ తేదీ సాయంత్రం 5.45 నుండి 6.30 గంటల వరకు ధ్వజావరోహణం, మార్చి 16, 17వ తేదీలలో రాత్రి 8 నుండి 9 గంటల వరకు పవలింపు సేవ నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.




👆 గ‌జ‌ వాహ‌నంపై ల‌క్ష్మీదేవి అలంకారంలో శ్రీ లక్ష్మీ న‌ర‌సింహస్వామి క‌టాక్షం

తిరుపతి, 2025 మార్చి 10: త‌రిగొండ‌ శ్రీ లక్ష్మీ న‌ర‌సింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమ‌వారం రాత్రి 8 గంట‌ల‌కు స్వామివారు గజవాహనంపై స్వామివారు శ్రీ గ‌జ ల‌క్ష్మీదేవి అలంకారంలో భక్తులను అనుగ్ర‌హించారు.

వాహనసేవ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహ‌న‌సేవ ద‌ర్శ‌నం వ‌ల్ల క‌ర్మ విముక్తి క‌లుగుతుంద‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్స‌వాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ గోపినాథ్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణ‌మూర్తి, ఆలయ అర్చకులు శ్రీ కృష్ణ ప్ర‌సాద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మార్చి 11న స్వామివారి క‌ల్యాణం

శ్రీ లక్ష్మీ న‌ర‌సింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు తిరుచ్చి ఉత్స‌వం, సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు స‌ర్వ‌భూపాల వాహ‌నం, రాత్రి 8 నుండి 10 గంటల వరకు కల్యాణోత్సవం, రాత్రి 11 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు గరుడ వాహనంపై భక్తులను క‌టాక్షించ‌నున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.




👆 ధ్వజారోహ‌ణంతో పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం

– వైభ‌వంగా శ్రీ‌వారి క‌ల్యాణం

తిరుపతి, 2025 మార్చి 10: కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమ‌వారం ఉద‌యం 10.10 నుండి 10.30 గంట‌ల‌ వరకు ధ్వజారోహ‌ణంతో శాస్త్రోక్తంగా బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. మార్చి 14వ తేదీ వరకు బ్ర‌హ్మోత్స‌వాలు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి.

వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు.

అనంత‌రం సాయంత్రం 6 గంట‌లకు శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం వైభ‌వంగా జ‌రిగింది. ఇందులో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఆల‌య అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్ని ప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళ సూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన పిఠాపురం ప‌రిస‌ర ప్రాంతాల‌ భక్తులు భక్తి పరవశంతో పులకించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సందీప్‌, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు, పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

కాగా మార్చి 11న సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి గ‌రుడ వాహ‌న సేవ జ‌రుగ‌నుంది.

మార్చి 11, 12, 13వ తేదీల‌లో ఉద‌యం 10 గంట‌ల‌కు స్వామి, అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం వైభ‌వంగా జ‌రుగ‌నుంది. మార్చి 12, 13వ తేదీల్లో సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల్‌సేవ చేప‌డ‌తారు. మార్చి 14న ఉద‌యం 10.10 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం, సాయంత్రం 5 గంట‌లకు ధ్వ‌జావ‌రోహ‌ణం నిర్వహించనున్నారు. మార్చి 15న సాయంత్రం 5.30 గంట‌లకు పుష్పయాగం నిర్వ‌హిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.






మార్చి 11న శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 46వ వర్ధంతి

తిరుపతి, 2024 మార్చి 10: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి సంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు వందల కృతులను స్వరపరిచిన సంగీత, సాహిత్య విద్వాంసులు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 46వ వర్ధంతి కార్యక్రమం మార్చి 11న మంగ‌ళ‌వారం జరుగనుంది.

టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా డిగ్రీ మ‌రియు పిజి క‌ళాశాల ప్రాగ‌ణంలోని శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ విగ్ర‌హానికి పుష్పాంజ‌లి స‌మ‌ర్పిస్తారు. అనంత‌రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఉద‌యం 10.30 గంటలకు సాహితీ స‌ద‌స్సుతో కార్యక్రమం ప్రారంభం కానుంది.

ఈ కార్యక్రమంలో శ్రీ అనంతకృష్ణశర్మ మనవరాలు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆంగ్ల శాఖ విభాగాధిపతి ఆచార్య రాళ్లపల్లి దీప్త ప్ర‌త్యేక అతిథిగా పాల్గొంటారు. రాళ్ల‌ప‌ల్లి సాహిత్యంపై తిరుప‌తికి చెందిన శ‌తావ‌ధాని శ్రీ ఆముదాల ముర‌ళి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అధ్యాప‌కులు డా.ల‌క్ష్మీనారాయ‌ణ‌ ప్ర‌సంగిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

20 ta oxirgi post ko‘rsatilgan.